22, ఆగస్టు 2009, శనివారం

స్వైన్ ప్లూ గందరగోళం


నాకనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడున్న ఓవర్ ఏక్షన్ మీడియా లేకుండా ఉంటే మన జీవితాలు ఎంత హాయిగా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఉంటాయా అని. లేకపోతే, చూడండి, చదువుకున్న వాళ్ళే హాస్పటల్స్ ముందర పెద్ద పెద్ద లైన్లలో పడిగాపులు పడి టెస్ట్ చేయించుకోవటానికి విరగపడి ఎదురుచూస్తున్నారు. పూనేలో మొదలయిన ఈ క్రౌడ్ మెంటాలిటీ, ముంబాయికి, బెంగుళూరికి పాకింది.దీనికి కారణం ఎవరు ?? మన స్వతంత్ర (మనకి మాత్రం స్వాతంత్రం లేదు, అవసరమైన వార్తలు వివరాలు మాత్రమె కోరటానికి/చదువుకోవటానికి)మీడియా కాదూ

ఈ విషయంలో నా అభిప్రాయం ఏమంటే:


1. సరే పెద్ద లైన్లో ఒక రోజంతా నిలబడి టెస్టు చేయించుకున్నాము మనకి ఇంకా స్వైన్ ఫ్లూ అంటలేదన్నారు. మరి రేపటిగురించి, మళ్ళీ టెస్ట్ చేయించుకుందామా!! ఇలా ఎన్నాళ్ళు??


2. అసలు మనకే రోగమూ లేకుండా ఈ టెస్టు కేంద్రాలోకి వెళ్ళి వందల మధ్య కూచుంటే, అక్కడే మనకు అంటే అవకాశాలు ఎక్కువగదా!


అందుకని, మనం డాక్టర్లు చెప్పే మాట విని, మనకు దురదృష్ట వశాన స్వైన్ ప్లూ లక్షణాలు కనపడితే అప్పుడు వెంటనే అలక్ష్యం చెయ్యకుండా డాక్టరు దగ్గరకి వెడితే చాలు. అనవసరంగా ఇలా గందరగోళపడి గుంపులు గుంపులుగా హాస్పటల్సు దగ్గర గుమికూడి వాళ్ళమీద వత్తిడి తేవటం మంచి పని కాదు.


పాపం ఈ హాస్పటల్ సిబ్బందికి, ఈ అక్షరాస్యులు అయిన మూకల్ని అదుపు చెయ్యటమే సరిపోతుంది. నిజంగా స్వైన్ ప్లూ వచ్చినవాళ్ళకు వైద్యం చెయ్యలేక పోవచ్చు.అటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరం

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.